చివ్వెంల, నవంబర్ 13 : ‘సూర్యాపేట నియోజకవర్గంలో ఆరు సార్లకు పైగా ఓటు వేసిన వారున్నారు.. ఎవరికి వేసిన ఓటు మంచి జరిగిందో ఆలోచించాలి. కాంగ్రెస్కు వేసిన ఓటు రైతాంగాన్ని సర్వనాశనం చేసింది. కారు గుర్తుకు వేసిన ఓటు బీడు భూములను సస్యశ్యామలం చేసింది. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. మళ్లీ ఆశీర్వదిస్తే మరిన్ని పథకాలు వస్తాయి. మరింత అభివృద్ధి జరుగుతుంది.’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. చివ్వెంల, ఆత్మకూర్.ఎస్ మండలాల్లోని పలు గ్రామాల్లో సోమవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో వెలుగు నింపేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ నాయకులకు పదవులే ఎజెండా అయితే.. బీఆర్ఎస్కు ప్రజా సంక్షేమమే ఎజెండా అని పేర్కొన్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ చీకట్లు, కరువు తప్పదని హెచ్చరించారు. ఆ పార్టీ నాయకులను ఊరి బయటి నుంచే తరిమేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డాగులు వేయడానికి తాను టైగర్ను కానని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే సేవకుడిని మాత్రమేనని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
అభివృద్ధి చూసి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ సూర్యాపేట నియోజక వర్గ అభ్యర్థి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రజలను కోరారు. మండలంలోని గాయంవారిగూడెం, గుర్రంతండా, టీకంతండా, బంగారితండా, ఎంజీనగర్తండా, సర్వితండా, వాల్యాతండా, జగనతండా, భూక్యాతండా, మంగళితండా, లక్ష్మీనాయక్తండా, పులితండా, సేవాలాల్తండా,వట్టిఖమ్మంపహాడ్, పాచ్యానాయక్ తండా, బద్యాతండా, పిల్లలజెగ్గుతండా, అక్కలదేవిగూడెం, జయరాంగుడితండా, బండమీదిచందుపట్ల, మొగ్గయ్యగూడెం, భీమ్లాతండాలో మంత్రి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజక వర్గ ప్రజలు ఆరుసార్లకు పైగా ఓటేసిన అనుభవం ఉన్నదని, ఏవరికి వేసిన ఓటు ద్వారా మంచి జరిగిందో ఆలోచించాలన్నారు. కాంగ్రెస్కు వేసిన ఓటు రైతాంగాన్ని సర్వనాశనం చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులకు పదవులే తప్పా ప్రజా సంక్షేమమే పట్టదన్నారు. 2014లో బీఆర్ఎస్కు వేసిన ఓటు కాళేశ్వరం జలాలు తెచ్చి ఇక్కడి బీడు భూములను సస్యశ్యామలం చేసినట్లు చెప్పారు. అలాగే రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రుణమాఫీ వంటి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను తీసుకొచ్చినట్లు వివరించారు. మళ్లీ తనను ఆశీర్వదిస్తే రూ.2 వేల పింఛన్ 5 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, కేసీఆర్ బీమా, సన్న బియ్యం, సౌభాగ్యలక్ష్మి కింద నెలకు రూ.3 వేలు, రూ.400కే గ్యాస్ సిలిండర్, ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు కట్టి ఇస్తామని తెలిపారు.
నియోజక వర్గంలో ప్రతి గ్రామంలో ఇండ్లు కట్టించే బాధ్యత స్వయంగా తానే తీసుకుని శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ 5 గంటలే కరెంట్ ఇస్తున్నదని మాజీ సీఎం కుమారస్వామి చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అన్నారు. కావాలంటే కర్ణాటకలో 18 గంటలు విద్యుత్ వైర్లు పట్టుకుంటామని వారు తెలంగాణాలో ఒక్క నిమిషమైనా విద్యుత్ వైర్లు పట్టుకుని నిలబడడానికి సిద్ధమా అని సవాలు విసిరారు. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీయాలన్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ చీకట్లు, కరువు తప్పదన్నారు. డాగులు వేయడానికి తాను టైగర్ను కాదన్న మంత్రి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే సేవకుడిని మాత్రమేనని తెలిపారు. సూర్యాపేటలోని ఐటీ హబ్ స్థానిక యువతకే ఉద్యోగాలు కల్పించేలా నాలుగు వేల ఉద్యోగాలకు విస్తరిస్తామన్నారు.10 వేల మంది నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా వెయ్యి ఎకరాల్లో పారిశ్రామిక పార్క్ను ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. పదేండ్ల అభివృద్ధి, సంక్షేమ పాలన చూసి మరోసారి బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి తనను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ధరావత్ కుమారీబాబూనాయక్, జడ్పీటీసీ భూక్యా సంజీవ్నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జూలకంటి జీవన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మారినేని సుధీర్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావిచెట్టు సత్యం, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు, జిల్లా నాయకులు గుర్రం సత్యనారాయణరెడ్డి, రామగిరి నగేశ్, ఊట్కూరి సైదులు, నాగరాజు, రవి, నాగయ్య పాల్గొన్నారు.
కాంగ్రెస్తో ఒరిగిందేమీ లేదు..
ఆత్మకూర్.ఎస్ : రాష్ర్టాన్ని దశాబ్ధాలుగా పాలించిన కాంగ్రెస్ పాలనతో ఒరిగిందేమి లేదని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఎవరికి వేసిన ఓటు ఏం తెచ్చిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. సోమవారం ఆత్మకూర్.ఎస్ మండలం కోటినాయక్తండాలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. నియోజక వర్గంలో ఇండ్లు లేని ప్రతి పేదకు ఇల్లు కట్టించే బాధ్యత తనదేనన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే కరెంట్ కష్టాలు రావడం ఖాయమని, కర్ణాటక పరిస్థితులే ఇక్కడా పునరావృతం అవుతాయని తెలిపారు. చెప్పిన మాటపై నిలబడే నాయకుడు ఒక్క కేసీఆరే అని గత రెండు మ్యానిఫెస్టోలను వంద శాతం అమలు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, ఎంపీపీ మర్ల స్వర్ణలతాచంద్రారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూడి నర్సింహారావు, బత్తుల రాజేంద్రప్రసాద్, జిల్లా నాయకులు మర్ల చంద్రారెడ్డి, ముద్దం కృష్ణారెడ్డి, బెల్లంకొండ యాదగిరి, మిర్యాల వెంకట్రెడ్డి, సర్పంచ్ ధరావత్ మంగ, తంగెళ్ల మధుసూదన్రెడ్డి, బ్రహ్మం, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
స్వగ్రామంలో మంత్రి దీపావళి వేడుక
నాగారం : మంతరి జగదీశ్రెడ్డి దీపావళి వేడుకను నాగారంంలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో పాటు గ్రామానికి చెందిన చిన్నారులతో కలిసి జరుపుకున్నారు. చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయాలకు ప్రతీక దీపావళి పండుగ అని మంత్రి అన్నారు. ఈ నెల 30న కారు గుర్తుకు ఓటు వేసి డిసెంబర్ 3న అసలైన దీపావళి జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే మంత్రి ఇంటి ఆవరణలో మెట్లపై కూర్చొని గ్రామస్తులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఊరు బాగోగులను, గ్రామస్తుల క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. వేడుకల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్ గుండగాని అంబయ్య, ఉపాధ్యక్షుడు దోమల బాలమల్లు, చిల్లర చంద్రమౌలి, కడియం పరమేశ్వర్, గుంటకండ్ల ముకుందరెడ్డి, చిప్పలపల్లి సోమయ్య, మల్లేశ్, రాములు పాల్గొన్నారు.
పరామర్శ..
సూర్యాపేటరూరల్ : మండలంలోని రామారం గ్రామ సర్పంచ్ బొల్లం నాగరాజు తండ్రి సత్తయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. సత్తయ్య మృతదేహాన్ని మంత్రి జగదీశ్రెడ్డి సందర్శించి పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.