ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పాపానికి బాధ్యులు ఎవరని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కాంగ్రెస్, బీజేపీని సూటిగా ప్రశ్నించారు. ఏడు దశాబ్దాలుగా దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిన పాలకుల పాపానికే కదా మునుగోడు ప్రాంతంలో ఫ్లోరోసిస్ మహమ్మారి విజృంభించిందని దుయ్యబట్టారు. ఇంతకాలం ఉమ్మడి నల్లగొండ జిల్లాను శాసించామని గప్పాలు కొడుతున్న నేతలు అందుకు బాధ్యులు కారా? అని నిలదీశారు. స్వంతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మరింతమంది అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు మంజూరు చేయగా, మంత్రి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం, గట్టుప్పల్ మునుగోడులో లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను అందజేశారు. ఆయన వెంట ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్రావు, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. పింఛన్లు అందుకున్న వృద్ధులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
మునుగోడు, ఆగస్టు 17 : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని 27 గ్రామాలకు చెందిన 1,481 మందికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేయగా బుధవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 278 మంది లబ్ధిదారులకు పింఛన్ కార్డులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అహర్నిషలు కష్టపడి రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ వెంటే మనమంతా నిలబడాలని కోరారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ పస్తులుండొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి వచ్చిన పథకమే ఆసరా పింఛన్లు అని స్పష్టం చేశారు. మునుగోడు ప్రాంతంలో ఫ్లోరైడ్ వల్లే దివ్యాంగులు 15శాతం ఉన్నారని, ఈ పాపం గత 50ఏండ్లుగా పాలించిన పాలకులదేనని మండిపడ్డారు.
ఈ ప్రాంతానికి గతంలో ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకులెవరూ ఫ్లోరైడ్ సమస్యను పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ వల్లే ఫ్లోరైడ్కు శాశ్వత పరిష్కారం లభించిందని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో కొత్తగా ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదని స్వయంగా కేంద్ర మంత్రి పార్లమెంటులో ప్రకటన చేశారని, ఇదంతా మిషన్ భగీరథ ద్వారా సీఎం కేసీఆర్ సాధించిన ఘనత అని కొనియాడారు. ఏటా సంక్షేమానికి రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని చెప్పారు. మునుగోడు ప్రాంత అభివృద్ధిపై టీఆర్ఎస్ ప్రభుత్వానికే చిత్తశుద్ధి ఉందని, ఆచరణలో అది రుజువవుతుందని అన్నారు. స్వార్థ ప్రయోజనాలకు అమ్ముడుపోయే నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని తెలిపారు. అనంతరం చీకటిమామిడిలో 108 మంది లబ్ధిదారులకు కొత్త పింఛను కార్డులను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, నకిరేకల్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్రావు, కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఆర్డీఓ జగన్నాథరావు, డీఆర్డీఓ కాళిందిని, ఎంపీపీ కర్నాటి స్వామి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి, సర్పంచులు మిర్యాల వెంకన్న, తాటికొండ సంతోష, వైస్ ఎంపీపీ అనంత వీణ, ఎంపీటీసీలు బొడ్డు శ్రావణి, వనం నిర్మల, బొల్గూరి లింగయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, ఎంపీఓ సుమలత, పంచాయతీ కార్యదర్శులు మురళీమోహన్, లింగస్వామి పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురంలో 1424 మందికి పింఛన్లు
సంస్థాన్ నారాయణపురం : మండల వ్యాప్తంగా 1424 మందికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు కాగా మంత్రి జగదీశ్రెడ్డి బుధవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో 300 మందికి పంపిణీని ప్రారంభించారు. చిమిర్యాల, అల్లందేవి చెరువు గ్రామాల లబ్ధిదారులు ఇందులో పాల్గొన్నారు. అలాగే అల్లందేవి చెరువు గ్రామపంచాయతీ ఆవరణలో కొత్త పింఛన్లు మంజూరు కావడంతో ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతి లబ్ధిదారులతో కలిసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచులు శ్రీహరి, సుర్వి యాదయ్య, దోనూరి జైపాల్ రెడ్డి, ఎంపీటీసీ బచ్చనగోని గాలయ్య, ఎంపీడీఓ యాదగిరి, ఎంపీఓ నర్సింహ పాల్గొన్నారు.
టీఆర్ఎస్లోకి మహ్మదాబాద్ ఉప సర్పంచ్
సంస్థాన్ నారాయణపురం : మండలంలోని మహ్మదాబాద్ గ్రామ ఉప సర్పంచ్ మాధురీసమరసింహారెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు, పంచాయతీ సభ్యుడు నల్లబోతు చైతన్యయాదవ్ హైదరాబాద్లో మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో బుధవారం టీఆర్ఎస్లో చేరారు.
చౌటుప్పల్లో 843 మందికి కొత్త పింఛన్లు
చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బుధవారం పట్టణానికి చెందిన 843 మందికి కొత్త పింఛన్ కార్డుల పంపిణీని మంత్రి జగదీశ్రెడ్డి ప్రారంభించారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, డీఆర్డీఏ పీడీ ఉపేందర్రెడ్డి, ఆర్డీఓ ఎస్ సూరజ్కుమార్, మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలంగౌడ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
గట్టుప్పల్లో..
చండూరు : మండలంలోని గట్టుప్పల్, తెరట్పల్లి, కమ్మగూడెం, కొండాపురం గ్రామాలకు చెందిన కొత్త పింఛన్దారులకు బుధవారం గట్టుప్పల్లో మంత్రి జగదీశ్రెడ్డి కార్డులను అందజేశారు. జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, ఎంపీడీఓ జానయ్య, సర్పంచులు ఇడెం రోజా, వీరమల్ల శ్రీశైలంగౌడ్, ఎంపీటీసీలు అవారి గీతాశ్రీనివాస్, గొరిగె సత్తయ్య, చెరుపల్లి భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు బండారి చంద్రయ్య, చెరుపల్లి ఆంజనేయులు, ఇడెం కైలాసం, గణేశ్, ఆనంద్, భీమగాని మహేశ్ పాల్గొన్నారు.
హామీని నిలబెట్టుకున్న సర్కారు
57ఏండ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేస్తామని టీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటన చేయగానే దరఖాస్తు చేసుకున్నా. పింఛను మంజూరు కావడంతో నా జీవితానికి కొండంత భరోసా లభించింది.
– దొమ్మాటి సాయిలు, వృద్ధాప్య పింఛను లబ్ధిదారు, మునుగోడు
పింఛనుతో భరోసా
గతంలో పాలించిన ప్రభుత్వాలు సంక్షేమం పట్ల ఎలాంటి శ్రద్ధ చూపలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే టీఆర్ఎస్ సర్కారు సంక్షేమానికి పెద్దపీట వేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్లతో ఎంతోమంది వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు భరోసా లభించింది. ప్రతినెలా పింఛన్లు అందుకుంటున్న ప్రతి ఒక్కకి కండ్లలో ఎనలేని ఆనందం కనపడుతుంది.
– పెరుమాళ్ల రామలింగయ్య, వృద్ధాప్య పింఛను లబ్ధిదారు, మునుగోడు
కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు
మాది నిరుపేద కుటుంబం. ఇటీవల నా భర్త చనిపోయాడు. జీవ నం సాగించేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. వితంతు పింఛ ను కోసం దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజులకే టీఆర్ఎస్ ప్రభుత్వం పింఛను మంజూరు చేసింది. ఎంతోమంది అభాగ్యులకు అండగా నిలబడుతున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– రావెల లూర్దుమేరీ, వితంతు పింఛను లబ్ధిదారు, మునుగోడు