బొడ్రాయిబజార్, ఫిబ్రవరి 4 : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో సూర్యాపేట జిల్లాకేంద్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తున్నది. జిల్లాకేంద్రంలో రెండు మినీ ట్యాంక్బండ్లు, మెడికల్ కళాశాల, మహా ప్రస్థానం, ప్రధాన రహదారి విస్తరణ పనులు సూర్యాపేటకు కొత్త అందాలు తెస్తున్నాయి. కొత్త అందాలను వీక్షించేందుకు వచ్చి పోయే ప్రజలకు ఆనందాన్ని పంచేలా రహదారులు, రహదారులపై ఏర్పాటు చేసిన చౌరస్తాలను విస్తరిస్తున్నారు.
ఈ విస్తరణలో భాగంగా రహదారులు, కూడళ్లలో ఏర్పాటుకు రూ.30లక్షల వ్యయంతో హైదరాబాద్లో తయారు చేయించి తీసుకొచ్చిన బొమ్మలు సూర్యాపేటకు కొత్త అందాలు తేనున్నాయి. ఇప్పటికే ప్రధాన రహదారుల మధ్యలో డివైడర్లు కట్టి అందులో పచ్చదనం ఉట్టిపడేలా మొక్కలు నాటి సంరక్షిస్తుండగా పట్టణంలోని మరికొన్ని రహదారులకు పచ్చదనం పులిమి బొమ్మలను ఏర్పాటు చేసి నూతన అందాలు తేనున్నారు. జిల్లాకేంద్రంలోని పీఎస్ఆర్ సెంటర్, రాఘవప్లాజా సెంటర్లో జరుగుతున్న జింక, నెమలి, ఎద్దు బొమ్మల ఏర్పాటు, గ్రీనరీ పనులను మున్సిపల్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి శనివారం పరిశీలించారు.