సుబేదారి, జనవరి 23 : వడగండ్ల వర్షంతో నష్టపోయిన ప్రతి రైతునూ ప్ర భుత్వం ఆదుకొంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. దెబ్బతిన్న పంటల నష్టం నివేదికలను వెంటనే అందజేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఆదివారం హనుమకొండ కలెక్టరేట్లో వరంగల్, హనుమకొండ రెండు జిల్లాల్లో కొవి డ్ వ్యాప్తి నివారణ చర్యలు, జ్వర సర్వే, దళితబంధు పథకం అమలు తీరుపై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో సమీక్షించారు. వచ్చే నెల 5వ తేదీలోపు వంది మంది దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు.