నకిరేకల్, ఫిబ్రవరి 20 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నకిరేకల్ మండలం నోముల గ్రామంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు, కో ఆప్షన్ సభ్యులు ఖాసీంఖాన్ ఆధ్వర్యంలో, కేతేపల్లి మండలం బొప్పారం గ్రామంలో పలు పార్టీలకు చెందిన నాయకులు ఆ గ్రామ సర్పంచ్ కర్ర ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో నకిరేకల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పార్టీలో చేరిన వారిలో నాయకులు కుంభం శివయ్య, నీలం మల్లయ్య, సైదిరెడ్డి, వీరయ్య, సైదులు, సతీశ్, మల్లయ్య, నిదుర రమేశ్, సన్నాయిల సోమయ్య, పాపిరెడ్డి, షాబొద్దీన్, నబీ, నిదుర నాగమల్లేశ్, జంపంగి శ్రీను ఉన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, బీఆర్ఎస్ నకిరేకల్, కేతేపల్లి మండలాల అధ్యక్షులు ప్రగడపు నవీన్రావు, మారం వెంకట్రెడ్డి, పట్టణాధ్యక్షుడు యల్లపురెడ్డి సైదిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.