బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. సోమవారం అర్వపల్లి మండలం తిమ్మాపురం, కోమటిపల్లి,
సూర్యనాయక్ తండా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో
బీఆర్ఎస్లో చేరారు. లాగే నాగారం మండలం డి.కొత్తపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, సీపీఐ నాయకులు, మద్దిరాల
మండలానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు గులాబీ కండువా కప్పుకొన్నారు. అనంతగిరి మండలం చనుపల్లి
గ్రామానికి చెందిన పలు కుటుంబాలు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
అర్వపల్లి, సెప్టెంబర్ 11 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని చూసే సబ్బండ వర్గాలు బీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశక్షర్కుమార్ అన్నారు. సోమవారం తిరుమలగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని తిమ్మాపురం గ్రామం నుంచి పీఏసీఎస్ డైరెక్టర్ మారం వెంకట్రెడ్డి, బండి వీరారెడ్డి, గంగ వీరారెడ్డి, ఇందుర్తి శ్రీనివాస్రెడ్డి, సుధాకర్రెడ్డి, కోటిరెడ్డి, మధుసూదన్రెడ్డి, ఉపేందర్రెడ్డి, మల్లారెడ్డితోపాటు కోమటిపల్లి గ్రామం నుంచి సీపీఐ నాయకులు చిరబోయిన లింగయ్య, నున్న వెంకన్న, లింగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరయ్య, లింగయ్య, యోగి, శ్రావణ్, సూర్యనాయక్తండా నుంచి కాంగ్రెస్ నాయకులు బనావత్ శ్రీను, వెంకన్న, సైదులు, నరేశ్, చంద్రశేకర్తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమైక్య పాలనలో కనీస అవసరాలు తీరని ప్రజలు స్వరాష్ట్రంలో, సీఎం కేసీఆర్ నాయకత్వంలో నాణ్యమైన జీవన ప్రమాణాలు అందుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు కందుల దశరథరామారావు, ఎస్ఎంసీ చైర్మన్ తండ లింగమూర్తి, నాయకులు వేణుధర్రెడ్డి, నోముల రమేశ్, బూర్గుల బబ్లూ, సంజీవ పాల్గొన్నారు.
నాగారం : మండలంలోని డి.కొత్తపల్లికి చెందిన కాంగ్రెస్, సీపీఐ నాయకులు 50 మంది ఎమ్మెల్యే కిశోర్కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో కొంపల్లి సతీశ్, మణికంఠ, సృజన్, వెంకన్న, నరేశ్, సైదులు, చంద్రయ్య, రాజేశ్ ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పయ్య, బీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్బాబు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు యారాల నరసింహారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు పడిశాల లింగయ్య, సోమేశ్వర్రెడ్డి, అశోక్, అనిల్, నరేశ్ పాల్గొన్నారు.
అనంతగిరి, సెప్టెంబర్ 11 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మద్దతుగానే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు. మండలంలో చనుపల్లికి చెందిన నల్లా భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాల సభ్యులు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టిలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చుట్టపుచూపుగా మండలానికి వస్తూ ఇతర రాష్ట్రాల్లో విహరించే నాయకులు కోదాడ నియోజకవర్గ ప్రజలు హర్షించరని పేర్కొన్నారు.
ఎవరెన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్ర ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వానికే పట్టం కడుతారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసే వారికి భవిష్యత్లో గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గింజుపల్లి రమేశ్, ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ మట్టపల్లి సంధ్యాసైదులు, ఉప సర్పంచ్ గరిడేపల్లి సైదులు, మండల ప్రధాన కార్యదర్శి మాగి యాకోబు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జొన్నలగడ్డ శ్రీనివాస్రావు, గ్రామ శాఖ అధ్యక్షుడు మద్ది ధన్వంతరెడ్డి, నాయకులు మధుసూదన్, వెంపటి వెంకటేశ్వర్రావు, కల్వకుంట్ల భిక్షం, మట్టపల్లి శ్రీనివాస్రావు పాల్గొన్నారు.