నార్కట్పల్లిలో 127 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకాలు చెక్కులు పంపిణీ
నార్కట్పల్లి: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకాలు దేశంలోనే చారిత్రాత్మక పథకమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమ ర్తి లింగయ్య పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 127 మందికి మంజూరైన రూ.కోటి 50 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక శబరి గార్డెన్లో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతీ ఆడబిడ్డకు నేనున్నానని మేనమామలా సీఎం కేసీఆర్ సాయం చేస్తున్నారని అన్నారు.
ఎలాంటి అపోహలకు గురి కావద్దని కులమతాలకు అతీతంగా ప్రతీఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలో త్వరలో బీటీ రోడ్లు వేయిస్తాన న్నారు. మండలాన్ని అభివృద్ధి పరుస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, తహసీల్దార్ పల్నాటి శ్రీనివాస్ రెడ్డి, బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, యానాల అశోక్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.