దేవరకొండ: ప్రజలకు అన్ని వసతులు ఒకే వద్ద ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణం బస్టాండ్ సమీపంలోని 2 ఎకరాలలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.4.50 కోట్లు నిధులచే సమీకృత మార్కెట్ నిర్మిస్తే కూరగాయలు, పండ్లు, పూలు, నాన్వెజ్, చేపల దుకాణాలు ఓకే సముదాయంలో ఉంటే మార్కెట్కు వచ్చే ప్రజలందరికీ అన్ని రకాల వుస్తువులు అందుబాటులో ఉంటాయని అన్నారు.
సమీకృత మార్కెట్తో దేవరకొండ పట్టణ రూపురేఖలు మారుతాయని ఆన్నారు. సుమారు 150 షాపులతో కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు రవీంద్రకుమార్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, కౌన్సిలర్లు హన్మంత్ వెంకటేశ్గౌడ్, రైస్, కొండ్ర మల్లేశ్వరీయాదవ్, టీవీఎన్రెడ్డి, పున్న వెంకటేశ్వర్లు, కమిషనర్ వెంకటయ్య, ఆశోక్, పొన్నబోయిన సైదులు, తౌఫిక్ ఇలియాస్ పటేల్ పాల్గొన్నారు.