నల్లగొండ : మానసిక సమస్యల కారణంగా ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం అనాజీపురంలో ఈ ఘటన జరిగింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన గంటాయట బాలకృష్ణ (46) కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక ఎస్ఆర్ హెచరీస్లో రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు. కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున కోళ్లఫారంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.