మిర్యాలగూడ రూరల్, డిసెంబర్ 1 : మండలంలోని ఆలగడప గ్రామానికి చెందిన నిమ్మల యాదయ్య(36) ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ ఎస్ఐ దోరేపల్లి నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. నిమ్మల యాదయ్య ట్రాక్టర్, హార్వెస్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతడికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కొంత కాలంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లిన అతను అవంతీపురం శివారులో గుళికలు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మిర్యాలగూడ ప్రాంతీయ దవాఖానకు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఉరేసుకొని మహిళ ..
మఠంపల్లి : జీవితంపై విరక్తి చెంది మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని సుల్తాన్పూర్తండాలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. సుల్తాన్పూర్తండాకు చెందిన భూక్య స్వామి రెండో కుమార్తె సౌడాసోత్ అనూరాధ(22) వివాహం తుమ్మలతండాకు చెందిన దేవరాజ్తో ఆరు నెలల క్రితం జరిగింది. వివాహమైన రెండు నెలలు తర్వాత భర్తపై ఇష్టంలేక ఆమె తన తల్లిగారింటికి వచ్చింది. అయితే తల్లిదండ్రులు, పెద్దలు అత్తగారింటికి వెళ్లాలని ఆమెకు పదే పదే నచ్చజెప్పారు. అయితే భర్త ఇంటికి వెళ్లడం ఇష్టంలేక జీవితంపై విరక్తితో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. అనూరాధ తండ్రి భూక్య స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఇరుగు రవి తెలిపారు.