మాల్: పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పని చేయాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం చిం తపల్లి మండల కేంద్రంలోని సాయి సుమంగళి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా గ్రామ కమిటీ సభ్యులు, నాయకులు పనిచేయాలన్నారు.
ప్రతిపక్షాల మాటలను నమ్మి మోసపోకుండా చర్యలు చేపట్టాలన్నారు. గత పాలకులు చేసిన పనులను ఇప్పుడు జరుగు తున్న అభివృద్ధి పనులను తెలియజేయాల్సిన అవసరం మనపైన ఉందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని పథకాల ను తెలంగాణలో చేస్తున్న ఘనతం ఒక్క కేసీఆర్కే దక్కిందన్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్రెడ్డి, సాగర్రావు, గోపిడి కిష్టారెడ్డి, నట్వ గిరిధర్, గున్రెడ్డి శ్రీని వాస్రెడ్డి, బాదేపల్లి పులిరాజు, పూల యాదయ్య, మాస భాస్కర్, శ్రీశైలం, సుమతిరెడ్డి, పుర్షోత్తం రెడ్డితో పాటు వివిధ గ్రామాల కమిటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మండల నూతన కమిటీ ఎన్నిక
టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా దొంతం చంద్రశేఖర్రెడ్డిని, ప్రధాన కార్యదర్శిగా ఉజ్జిని నరేందర్ రావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాపై నమ్మకంతో అప్పగించిన ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమా ర్కు, మండలంలోని నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తామన్నారు