భువనగిరి కలెక్టరేట్, జనవరి 20 : కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని చూపు సమస్యలను తొలగించుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కె.మల్లికార్జునన్రావు అన్నారు. మండలంలోని నందనం గ్రామంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయడంతోపాటు వారికి అవసరమైన కళ్లద్దాలు, మందులను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్నదన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రశాంత్, బొల్లేపల్లి పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ కె.యామినిశృతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వలిగొండ : కంటి వెలుగు కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్రావు వైద్యాధికారులకు సూచించారు. మండలంలోని దాసిరెడ్డిగూడెంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు వైద్య శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించి మాట్లాడారు. చూపు సమస్య ఉన్నవారందరికీ పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు, మందులు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో కంటి వెలుగు ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ సుమన్ కల్యాణ్, సర్పంచ్ కొమిరెల్లి సరితాసంజీవరెడ్డి, వైద్యులు రమేశ్, నయీమొద్దీన్, తేజస్విని, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
భూదాన్ పోచంపల్లి : మండలంలోని సాయినగర్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంధత్వ నివారణ కోసం ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం చేపట్టిందన్నారు. కంటి సమస్య ఉన్నవారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ గౌన శోభ, మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ పాపారావు, మండల వైద్యాధికారి యాదగిరి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకొని చూపు సమస్యలు పరిష్కరించుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని రెండో వార్డులో కొనసాగుతున్న కంటి వైద్య శిబిరాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డులోని కొంత మంది వృద్ధులను తన వాహనంలో కంటి వైద్య శిబిరానికి తీసుకొచ్చి పరీక్షలు చేయించారు.