యాదాద్రిభువనగిరి, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) : జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా జరిగాయి. గ్రామగ్రామానా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆలేరు పట్టణంలో మహాత్ముడి విగ్రహానికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
భువనగిరి పట్టణంలోని గాంధీ పార్కులో మహాత్ముడి విగ్రహానికి ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి నివాళులర్పించి.. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జడ్పీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి పుష్ఫాంజలి ఘటించారు. కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, శ్రీనివాస్రెడ్డి జాతిపిత చిత్రపటానికి నివాళులర్పించారు. జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్ నివాళులర్పించారు.
ఆలేరు రూరల్ : ఎంపీడీఓ కార్యాలయంలో గాంధీ విగ్రహనికి నివాళులర్పిస్తున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
భువనగిరి కలెక్టరేట్ : కలెక్టరేట్లో గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్ పమేలాసత్పతి
భువనగిరి అర్బన్ : గాంధీ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి