యాదగిరిగుట్ట, డిసెంబర్24 : యాదగిరి గుట్ట ప్రధానాలయంలో ఆళ్వార్ దివ్య ప్రబంధ అధ్యయనోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.
రెండోరోజు ఉదయం వేణుగోపాల స్వామిగా, సాయంత్రం గోవర్ధనగిరి ధారి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆదివారం సెలవు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాఢ వీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల కిటకిటలాడాయి.