కట్టంగూర్: మండలంలోని చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన రైతులు ఐక్యత చాటారు. గ్రామంలోని రిజర్వాయర్ సమీ పంలో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి కేంద్రం నిరుపయోగంగా ఉండడంతో చెర్వుఅన్నారం గ్రామ రైతులంతా ఐక్యమై ఉన్నలిఫ్ట్ మోటర్ల ఏర్పాటు కోసం విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రికి దరఖాస్తు చేసుకోగా అను మతి లభించింది. గ్రామ శివారులో పోచమ్మకుంట, మర్లకుంట కింద 125 మంది రైతులకు సుమారు 800 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీంతో రైతులు ఎకరానికి రూ. 14వేల చొప్పున సుమారు రూ. 90 లక్షలు జమ చేశా రు. ఆ డబ్బులతో 8 నెలల క్రితం అయిటిపాముల రిజర్వాయర్ నుంచి 5కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచమ్మ, మర్ల కుంట వరకు పైపులైన్ ఏర్పాటు చేసుకున్నారు.
తాము సమ కూర్చుకున్న 90లక్షల డబ్బుల నుంచిరూ.7లక్షలతో డెన్మార్క్ నుంచి దేశ్మి కంపెనీకి చెందిన 60 హెచ్పీ లిఫ్ట్ మోటర్లను కొనుగోలు చేశారు. కాగా శుక్రవారం దేశ్మి కంపెనీ ప్రతినిధులు ఏవీఎస్ మూర్తి, రవికాంత్లు ప్రారంభించి పైపులైన్ ద్వారా వచ్చే నీటిని వారు రైతులతో కలిసి పరిశీలించారు. దీంతో ఈ లిఫ్ట్ ద్వారా రెండు కుంటలు నిండి ఆ ప్రాం తంలో భూగర్భ జలాలు పెరగ నున్నాయి. అనంతరం అయిటిపాములలోని రైతు ఉత్పత్తిదారుల కంపెనీకి ఎస్ఆర్ఐ సంస్థ సహకారంతో రెండు వాహనాల కొనుగోలుకు కంపెనీ ప్రతినిధులు రూ.25లక్షల చెక్కులు అందజేశా రు. కార్య క్రమంలో రైతు ఉత్పత్తిదారుల అడ్వైజర్, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, ఉద్యానవన అధికారి విద్యాసాగర్, ఎఫ్పీవో చైర్మన్ చెవుగోని సైదమ్మ, రైతులు నంద్యాల నర్సిరెడ్డి, ఎడ్ల పెదరాములు, నంద్యాల వెంకట్రెడ్డి, రాంరెడ్డి, ఐఆర్డీఎస్ వాడపల్లి రమేశ్, సీఈవో యాతాకుల సైదులు తదితరులు పాల్గొన్నారు.