నల్లగొండ : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నోముల భగత్ తన నియోజకవర్గ ప్రజలకు ట్విట్టర్ ద్వారా ఓ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కొవిడ్ వ్యాపిస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నియమాలకు అనుగుణంగా నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు ఇంటి వద్దనే ఉంటూ సురక్షితంగా ఉండాలన్నారు. ఎదైనా సమస్య ఉంటే ఫోన్ ద్వారా తనని సంప్రదించవచ్చని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అంతకుక్రితం ఆయన హాలియా వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా మార్కెటింగ్ అధికారులు, రైస్ మిల్లర్స్తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నీ బ్యాగుల కొరత ప్రధానంగా తన దృష్టికి వచ్చిందని రానున్న మూడు రోజుల్లో ఆ సమస్యను పరిష్కరించనున్నట్లు తెలిపారు.