మిర్యాలగూడ, డిశంబర్ 6 : హింసలేని సమాజాన్ని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. మంగళవారం పట్టణంలోని కేఎల్ఎన్ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన సెమినార్లో ఆమె మాట్లాడారు. సమాజంలో రోజు రోజుకు మహిళలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మద్యం, డ్రగ్స్ కారణంగా లైంగిక దాడులు అధికమయ్యాయని, వీటి నివారణకు కఠిన చట్టాలను రూపొందించి అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలెబోయిన వరలక్ష్మి, గాదె పద్మమ్మ, కళాశాల డైరెక్టర్లు కిరణ్, నరేందర్రెడ్డి, హనుమంతరెడ్డి, అధ్యాపకులు సునీత, మాలతి, వసంత పాల్గొన్నారు.