మర్రిగూడ, డిసెంబర్ 2 : మండలంలోని శివన్నగూడెం గ్రామానికి చెందిన లెంకలపల్లి పద్మజ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి శుక్రవారం డాక్టరేట్ను అందుకున్నారు. 1997-2006 వరకు డాక్టర్ సినారె రచనలు మానవీయ విలువలు అనే అంశంపై తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు, ప్రొఫెసర్ మాసన చెన్నప్ప పర్యవేక్షణలో పరిశోధనకు గాను ఆమె పీహెచ్డీ అందుకున్నారు. పద్మజకు వర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్ సి.కాశీం, పాఠ్య ప్రణాళికా సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ సాగి కమలాకరశర్మ, ప్రొఫెసర్ సూర్యాధనుంజయ్, ప్రొఫెసర్ ఎస్.రఘు, ప్రొఫెసర్ ఎ.విజయలక్ష్మి, ప్రొఫెసర్ వారిజారాణి డాక్టరేట్ను ప్రధానం చేసి అభినందించారు.