స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ బాపూజీ జయంతి వేడుకలను బుధవారం జిల్లా వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని బాపూజీ సేవలను కొనియాడారు.
సూర్యాపేట కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, నల్లగొండలో జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి పాల్గొన్నారు. పీడిత ప్రజల పక్షపాతిగా, నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడిగా లక్ష్మణ్ బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శనీయమని మంత్రి పేర్కొన్నారు.