సూర్యాపేట రూరల్, మార్చి 25 : మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో చెన్నకేశవ స్వామి 120వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేవాలయం నుంచి గ్రామ పురవీధుల్లో రథంపై స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. అనంతరం హోలీ వేడుకలను జరుపుకొన్నారు.
డీజే పాటలకు మహిళలు, యువత రంగులు చల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ ఉత్సహంగా గడిపారు. కార్యక్రమంలో చైర్మన్ గూకంటి రాజబాబు రెడ్డి, కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్, వంశపారంపర్య ధర్మకర్త ఉమ్మెంతుల ఆహ్లాదరావు, ఉమ్మెంతల హరిప్రసాద్రావు, అర్చకులు మరిగంటి వరదాచార్యులు, ముడుంబై రఘువరన్ ఆచార్యులు, దరూరి రాఘవాచార్యులు, డైరెక్టర్లు చెర్కుపల్లి కృష్ణయ్య, మంగపండ్ల మల్లికార్జున్, జానయ్య, సైదమ్మ, శంకర్ పాల్గొన్నారు.