నల్లగొండ : ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నిషీయన్గా పని చేస్తున్న ఓ యువకుడు (18) వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నల్లగొండ జిల్లా శివార్లలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. హనుమాన్ నగర్కు చెందిన సకినాల సంతోష్ నల్లగొండ వీటీ కాలనీలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నిషీయన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
అయితే శనివారం తెల్లవారుజామున 3:45 గంటలకు పద్మావతి కాలనీ సమీపంలో ఉన్న రైలు పట్టాలపైకి వెళ్లి రైలు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం సంతోష్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.