యాదగిరిగుట్ట, ఏప్రిల్27 : రాజకీయ పార్టీలకతీతంగా గొల్లకురుమలు ఏకమై బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ గెలుపునకు కృషి చేయాలని కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు గవ్వల నర్సింహులు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలోని కురుమ సంఘం భవనంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. క్యామ మల్లేశ్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలేవైనా గొల్లకురుమ అభ్యర్థి గెలుపుకోసం పార్టీలకతీతకంగా గొల్ల కురుమలు ఐక్యత ప్రదర్శించారని, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్కు గెలిపించుకోవాలని కోరారు.
ఎక్కడికక్కడ ప్రతి గొల్లకురుమ సంఘటితమై కారుగుర్తుకు ఓటేసే విధంగా చూడాలన్నారు. గొల్లకురుమల సమస్యలను పార్లమెంట్లో వినిపించాలంటే క్యామ మల్లేశ్ గెలిచితీరాల్సిందేనని చెప్పారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్లకురుమలకు సముచిత స్థానం కల్పించారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన ఆయోధ్యయాదవ్, కురుమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డోకే బాలకృష్ణ, యాదవ సంఘం జిల్లా నాయకులు గంగుల శ్రీనివాస్, గొల్లకురుమ సంఘం జిల్లా నాయకులు కోరె భిక్షపతి, గొర్ల పెంపకందారుల జిల్లా డైరెక్టర్ జల్లి నర్సింహులు, నాయకులు శ్రీనివాస్ యాదవ్, పసుల బాలయ్య యాదవ్, ఆకుల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.