తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్
శాలిగౌరారం, ఆగస్టు 3 : స్వప్రయోజనాలు, కమీషన్లకు కక్కుర్తి పడే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించినట్లు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ఆరోపించారు. ఆయనకు మునుగోడు ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయమని పేర్కొన్నారు. బుధవారం శాలిగౌరారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని 20 వేల కోట్లకు తాకట్టు పెట్టిన రాజగోపాల్రెడ్డికి బుద్ధి చెప్పేలా సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ కుటుంబం కలిసి కట్టుగా పని చేస్తుందని ఈ సందర్భంగా అన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, కట్టా వెంకట్రెడ్డి, మామిడి సర్వయ్య పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసే చేరికలు
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతోనే టీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని ఇటుకులపహాడ్ నుంచి 15, తక్కెళ్లపహాడ్ నుంచి 5 కాంగ్రెస్ కుటుంబాలు బుధవారం మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కిశోర్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని గ్రహించి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ఉవ్వెత్తున చేరుతున్నారని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, ప్రధాన కార్యదర్శి చాడ హతీశ్రెడ్డి, గుజిలాల్ శేఖర్బాబు, జెర్రిపోతుల చంద్రమౌళిగౌడ్, సుల్తాన్ ఎల్లయ్య, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అక్కెనపల్లి శ్రీనివాస్, శ్రీరాములు, భీమనబోయిన లక్ష్మయ్య, వేల్పుల నరేందర్, చివుట భిక్షమయ్య, శీలం వెంకన్న పాల్గొన్నారు.