కోదాడ, జూలై 31 : కోదాడ కాన్వాసింగ్ అసోసియేషన్ నూతన కమిటీని గురువారం సంఘ సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అర్వపల్లి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శిగా గడ్డం రాంబాబు, ఉపాధ్యక్షుడిగా చాప గోవిందరావు, సహాయ కార్యదర్శిగా ఓరుగంటి శ్రీనివాసరావు, కోశాధికారిగా సముద్రాల బద్రిష్ తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు అభినందనలు తెలిపి మాట్లాడారు. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల సహకారంతో అసోసియేషన్ అభివృద్ధికి, సభ్యులకు, గుమస్తాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు.
అనంతరం గుమస్తాల సంఘం కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అనంతు సైదులు, ఉపాధ్యక్షుడిగా వెంకట రాజారావు, ప్రధాన కార్యదర్శిగా వేమూరి నరసింహమూర్తి, సహాయ కార్యదర్శిగా పల్లా నాగరాజు, కోశాధికారిగా కొల్ల సురేశ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గట్ల కోటేశ్వరరావు సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు పిన్నపురెడ్డి వీరారెడ్డి, ఓరుగంటి ప్రభాకర్, వెంపటి వెంకటేశ్వరరావు, వెంపటి మధుసూదన్, ఓరుగంటి పురుషోత్తం, చల్ల ప్రకాశ్, పర్వతాలు,అలీబాయ్, రఘు, సాయి, వీరయ్య, గరినే శ్రీధర్, తూనం కృష్ణ, రామినేని శ్రీనివాసరావు, యలమందల నరసయ్య, కనగాల నాగేశ్వరరావు, ఆవుల రామారావు, తోట శ్రీను, పైడిమర్రి వెంకటనారాయణ పాల్గొన్నారు.