కట్టంగూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం మండలంలోని దుగినవెల్లి, కట్టంగూర్ గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన 100 మంది ఆదివారం ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదన్నారు. పాత, కొత్త అనే తేడా లేకుండా నాయకులు, కార్యకర్తలు కలిసి మెలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరా ములు, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, సర్పంచ్ వనం సైదమ్మ, ఉప సర్పంచ్ అంతటి శ్రీను, పార్టీ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు,తదితరులు పాల్గొన్నారు.