భువనగిరికలెక్టరేట్, మార్చి 24 : జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. కంటివెలుగులో భాగంగా ఇప్పటి వరకు 1,70,789 కంటి పరీక్షలు చేపట్టామని డీఎంహెచ్ఓ డాక్టర్ కావూరి మల్లికార్జునరావు తెలిపారు. ఇందులో భాగంగా 28,996 రీడింగ్, 10,384 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. 12,236ప్రిస్క్రిప్షన్ అద్దాలకు ఆర్డర్ చేశామని తెలిపారు. శుక్రవారం ఒక్కరోజు జిల్లా లో 3,633 మందికిపరీక్షలు నిర్వహించి 496 మందికి రీడింగ్ అద్దాలను, 10,384మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలను పంపిణీ చేశామన్నారు. అలాగే 491మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలకు ఆర్డర్ చేసినట్లు అధికారులు తెలిపారు.
సూర్యాపేట: జిల్లాలో ఇప్పటి వరకు 2,76,944 మంది కంటి వెలుగులో పరీక్షలు చేయించుకున్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 6,525 మందికి పరీక్షలు చేయగా వీరిలో 1,182 మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు. 854 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాస్లు అందిచనున్నారు. 3,025 మందికి వివిధ రకాల మందులు పంపిణీ చేసినట్లు అధికారులు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 2,76,944 మంది కంటి పరీక్షలకు హాజరుకాగా వీరిలో 58,407 మందికి రీడింగ్ 33,707 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలు ఆర్డర్ చేశారు. దాదాపు 1,35,711 మందికి వివిధ రకాల మందులు ఇవ్వడం జరిగింది.
డీఎంహెచ్ఓ పరిశీలన : విద్యానగర్ కాలనీలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం ఆయన వెంట డాక్టర్ కళ్యాణ్చక్రవర్తి, డాక్టర్ నాగలక్ష్మి ఉన్నారు.
రామగిరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు పరీక్షలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 44 వ రోజు కొనసాగాయి. జిల్లాలో 74 వైద్య బృందాలు 10,204 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 1313 దగ్గర, 1166 మ ందికి దూరపు చూపు సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 1,243 మందికి అద్దాలు అవసరం ఉన్నట్లు గుర్తించి ఆర్డర్ చేశారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 4,18,008 మందికి కంటి పరీక్షలునిర్వహించినట్లు అధికారులు తెలిపారు.