శాలిగౌరారం: నిరుపేద ఆడబిడ్డల పెండ్లి కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి వారి జీవితాల్లో కొత్త వెలుగు లు నింపుతున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మండలం లోని 135 మంది లబ్ధిదారులకు రూ.1,35కోట్ల విలువ గల కల్యాణలక్ష్మి చెక్కులను, సీఎమ్ఆర్ఎఫ్ చెక్కులను అందజేసి మాట్లాడారు.
దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయలేని సాహసోపేతమైన నిర్ణయాలతో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథాకాలను చూసి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ సద్విని యోగం చేసుకోవాలని విజ్ణప్తి చేశారు.
ప్రతి ఇంటికి మిషన్ భగీరథ మంచినీరు అందాలి
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ మంచినీరు ప్రతి ఇంటికి చేరేలా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసు కోవాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ఆదేశించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గంట లక్ష్మ మ్మ అధ్యక్షతన జరిగిన మండల సర్వ సభ్యుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. అధికారులు బాధ్యతాయు తంగా వ్యవహరించాలని సూచించారు. 57సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఆసరా ఫించన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.
అదేవిధంగా రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక నుంచి జరగబోయో మండల సమావేశానికి అన్ని శాఖల అధికారు లు విధిగా హాజరు కావాలని లేకుంటే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి, ఎంపీపీ గంట లక్ష్మమ్మ, మార్కెట్ కమిటీ చైర్మెన్ కట్టా లక్ష్మి, పీఏసీఎస్ చైర్మెన్ తాళ్ళూరి మురళి, వైస్ ఎంపీపీ కందుల అనిత, రైతుబంధు మండల కన్వీనర్ గుండా శ్రీనివాస్, తాసీల్ధార్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ రేఖల లక్ష్మయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, కట్టా వెంకట్రెడ్డి, మామిడి సర్వయ్య, గంట శంకర్ పాల్గొన్నారు.