యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని సీఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు బుధవారం దర్శించుకున్నారు. స్నేహితులతో కలిసి ప్రత్యేక కాన్వాయిలో మల్లాపురం రహదారి నుంచి వైకుంఠ ద్వారం గుండా ఉత్తర ప్రాంతంలో గల ఘాట్రోడ్డు నుంచి యాదగిరి కొండపైకి చేరుకున్నారు. కొండపైన వీవీఐపీ గెస్ట్హౌస్ వద్దకు చేరుకుని లిఫ్ట్ గుండా ప్రధానాలయ మాఢవీధుల్లోకి చేరుకున్నారు.
పశ్చిమ సప్తతల రాజగోపురం గుండా ప్రధానాలయంలోకి వెళ్లి స్వయంభువుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గర్భాలయంలో అర్చకులు గోత్రనామాల పేరిట సంకల్పం గావించి స్వామివారి ఆశీర్వచనం అందించారు. ప్రధానాలయ ముఖ మండపంలో సువర్ణమూర్తులకు పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అద్దాల మండపం పక్కనే గల మండపంలో ఉప ప్రధానార్చక బృందం హిమాన్షుకు వేదాశీర్వచనం చేయగా, ఆలయాధికారి రాజన్బాబు స్వామివారి ప్రసాదం అందించారు. దర్శనం అనంతరం తూర్పు రాజగోపురం గుండా మాఢవీధుల్లోకి చేరుకుని భక్తులతో కాసేపు గడిపారు.