రామన్నపేట, జనవరి 12 : బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు సమన్యాయం జరుగుతున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన 50 కుటుంబాల వారు గురువారం ఆయన సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వీరికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని శివగల్ల నవ్య ఎంబీబీఎస్ చదువు నిమిత్తం రూ.50వేల ఆర్థిక సాయమందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామన్నపేట పట్టణ కేంద్రంలో కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేకంగా కోటి రూపాయల నిధులు మంజూరైటన్లు తెలిపారు.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి పలువురు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. వారి విశ్వాసాలను వమ్ము చేయకుండా ప్రతి కార్యకర్త అర్హూలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. పార్టీలో చేరిన వారిలో ముగ్గు వీరయ్య, కళ్లెం ముత్తిలింగం, యాదగిరి, శిరీషాయాదగిరి, రాములు, నర్సింహ, కళ్లెం చిన్నకిష్టయ్య, వానరాశి కాశయ్య, కళ్లెం గురిశెట్టి, రాములు, ధర్మనందన్, మత్స్యగిరి, జగన్నాథం, సైదులు, అయోధ్య ఉన్నారు.
బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పోతరాజు సాయికుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, పార్టీ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పోచబోయిన మల్లేశం, పట్టణ ప్రధాన కార్యదర్శి జాడ సంతోష్, సర్పంచులు గుత్తా నర్సిరెడ్డి, అప్పం లక్ష్మీనర్సు, ఉప్పు ప్రకాశ్, ఎంపీటీసీలు గొరిగె నర్సింహ, దోమల సతీశ్, నాయకులు పున్న జగన్మోహన్, బద్దుల రమేశ్, బత్తుల వెంకటేశం, కాటేపల్లి యాదయ్య, ఉపసర్పంచ్ పొడిచేటి కిషన్, బండ శ్రీనివాస్రెడ్డి, కొనూరు ముత్తయ్య, ఆవుల శ్రీధర్, పాల్గొన్నారు.