– నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు
రామగిరి, మార్చి 07 : మహిళల హక్కులు, వారి రక్షణ కోసం న్యాయ వ్యవస్థ నిరంతరం కృషి చేస్తుందని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నల్లగొండలోని న్యాయ సేవా సదన్లో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల హక్కులకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడినా బాధిత మహిళాలు న్యాయస్థానాల ద్వారా వారి హక్కులను కాపాడుకోవచ్చన్నారు. మహిళలు అన్ని రంగాల్లో తమ శక్తిని చాటుతూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. మహిళల అభ్యున్నతికి అందరూ సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లా కోర్టు రెండవ అడిషనల్ న్యాయమూర్తి ఎన్.రోజారమణి మాట్లాడుతూ మహిళా చట్టాలను వివరించారు. దీనిలో భాగంగా మహిళా న్యాయమూర్తులు, మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందచేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు దిలీప్ కులకర్ణి, డా.ప్రమీలాజైన్, కె.శీరిష, సౌందర్య, సాయి మేఘన, శరణి తేజ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.పురుషోత్తమరావు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ నిమ్మల భీమర్జున్రెడ్డి, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎం.లెనిన్బాబు, కోర్టు నాజర్ రాంబాబు, డిఎల్ఎస్ఏ సూపరింటెండెంట్ ఏ.స్వర్ణలత, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

‘మహిళా హక్కుల రక్షణకై న్యాయ వ్యవస్థ నిరంతరం కృషి’