రామగిరి, జనవరి 27: నల్లగొండ పట్టణంలోని కోర్టు ఆవరణలో కొత్తభవనంలో ఏర్పాటుచేసిన కుటుంబ న్యాయస్థానం హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్ పోలియో జడ్జి డాక్టర్ జి.రాధారాణి శనివారం ప్రారంభించారు. అనంతరం జ్యూడిషియల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకు ముందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు, న్యాయమూర్తులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
ఆమెను న్యాయమూర్తులు సన్మానించారు. అలాగే న్యాయశాఖ ఉద్యోగుల క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు జడ్జి తిరుపతి, కుటుంబ న్యాయస్థానం జడ్జి దుర్గాప్రసాద్, ఐదో అదనపు జడ్జి జి.వేణు, జిల్లా పరిపాలన అధికారి శ్రీనివాస్రెడ్డి, మాతంగి వీరబాబు, నేతి రఘుపతి పాల్గొన్నారు.