నందికొండ, ఏప్రిల్ 22 : రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో నందికొండ హిల్కాలనీలో నిర్మించిన బుద్ధవనం రాష్ట్రానికి మణిహారంగా నిలుస్తుందని అంతర్జాతీయ ధ్యాన కేంద్ర ఉపాసకుడు హేమంత్ అన్నారు. శనివారం బుద్ధవనంలోని కాఫ్రేన్స్ హాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ధ్యాన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధ ప్రేమికులను ఆకర్షించేలా బౌద్ధ వారసత్వ సంపదగా బుద్ధవనాన్ని ఏర్పాటు చేశారని కొనియాడారు. అంతకుముందు బుద్ధచరిత వనంలోని బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించి జాతకపార్కు, అవకాన బుద్ధ, మహాస్థూపం, ధ్యాన మందిరాలన్ని సందర్శించారు.