నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 29 : ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. సెకండ్ లాగ్వేజ్ పేపర్ -2 తెలుగు, సంస్కృతం, హిందీ పరీక్షకు 14,090 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 13,651 మంది హాజరయ్యారు. 439 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ 321 మంది, ఒకేషనల్కు118 మంది గైర్హజరయ్యారు. ఆయా పరీక్ష కేంద్రాలను సిట్టింగ్ స్కాడ్స్తో పాటు, ప్లయింగ్ స్కాడ్స్ తనిఖీ చేశారు.
సూర్యాపేట జిల్లాలో 7,846 మంది విద్యార్థులు హాజరు
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 8,226 మంది విద్యార్థులకు 7,846 విద్యార్థులు హాజరయ్యారు. 380 మంది గైర్హాజరయ్యారు. జనరల్ గ్రూప్లో 6,706 విద్యార్థులకు 6,460 మంది, ఒకేషనల్లో 1,520 మందికి 1,386 మంది హాజరయ్యారు. జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జానపాటి కృష్ణయ్య పరిశీలించారు.
పరీక్షలను సజావుగా
కోదాడ టౌన్ : ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకట్రావ్ అన్నారు. కోదాడ పట్టణ పరిధిలోని కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం పరీక్ష కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు అధికారులు తీసుకున్న చర్యలు, పోలీస్ బందోబస్తు, విద్యార్థుల హాజరు వివరాలను పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ జోత్స్నను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తాసీల్దార్ సాయి గౌడ్, ఫ్లయింగ్ స్వాడ్ టీమ్ అధికారి రవి కుమార్, అధికారులు పాల్గొన్నారు.