కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఆదివారం 843.24 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు ఒక క్రస్టు గేటు ద్వారా దిగువకు 662.38 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
కుడి, ఎడమ కాలువకు 81.46 క్యూసెక్కులు వెళుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 644.50 అడుగులుగా (4.33 టీఎంసీలు) ఉన్నట్లు అధికారులు తెలిపారు.