నకిరేకల్, జనవరి 3 : భారత దేశంలోని తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీ బాయి పూలే జయంతిని బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయంలో సావిత్రీబాయి పూలె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నకిరేకల్ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రసన్నరాజ్ పాల్గొన్నారు.
కట్టంగూర్ : కట్టంగూర్లోని అంగన్వాడీ కేంద్రంలో రజక రిజర్వేషన్ సమితి ఉపాధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్ సావిత్రీబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.
నార్కట్పల్లి : మండలంలోని ఎల్లారెడ్డి గూడెం జడ్పీహెచ్ఎస్లో హెచ్ఎం హిమజ సావిత్రీ బాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు.
చిట్యాల: మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయం, జడ్పీ ఉన్నత, గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో సావిత్రి బాయి పూలే జయంతిని నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో జిట్ట నగేశ్, అవిశెట్టి శంకరయ్య, మల్లం మహేశ్, అరూరి శ్రీను, జడ్పీహెచ్ఎస్లో ఎస్ఐ రవి పాల్గొన్నారు.
మిర్యాలగూడ/దేవరకొండ/హాలియా : భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త సావిత్రీబాయిపూలే జయంతి వేడుకలను బుధవారం మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో నిర్వహించారు. మిర్యాలగూడలోని కేఎన్ఎం డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ 1, 2, మహిళ సాధికారిత విభాగం ఆధ్వర్యంలో సావిత్రీబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ టి. వెంకటరమణ, అధ్యాపకులు పాల్గొన్నారు.
దేవరకొండ పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో సావిత్రీబాయి పూలే చిత్ర పటానికి సంఘం అధ్యక్ష, కార్యదర్శిలు టి.నర్సింహ్మ, అంకం చంద్రంమౌళి పూలమాల వేసి నివాళులర్పించారు. అనుముల మండలం చల్మారెడ్డిగూడెం జడ్పీహెచ్ఎస్లో సావిత్రీబాయి పూలే చిత్రపటానికి నివాళులర్పించారు.
నల్లగొండ రూరల్: నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో బీసీ సంక్షేమ సంఘం, మహిళ, ఉద్యోగ,విద్యార్థి సంఘాల ప్రతినిధులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.