యాదగిరిగుట్ట రూరల్, ఫిబ్రవరి 19 : యాదాద్రి భువనగిరి జిల్లాలో కొందరు పాల వ్యాపారులు కల్తీ పాలు తయారు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీ పాలతో ప్రజలకు తీవ్ర అనారోగ్యం కలుగుతుందని తెలిసినా అవి ఏ మాత్రం పట్టనట్లు తమ పని చేసుకుంటూ పోతున్నారు. జిల్లాలో ప్రధానంగా బొమ్మలరామారం, బీబీనగర్, భువనగిరి, భూదాన్ పోచంపల్లి మండలాల్లో ఈ దందా అధికంగా కొనసాగుతున్నది. దాంతో అప్రమత్తమైన ప్రభుత్వం కల్తీ పాలపై తయారీపై నిఘా పెట్టి ఉక్కుపాదం మోపుతున్నది. జనవరి నుంచి ఇప్పటి వరకు రాచకొండ కమిషనరేట్, యాదాద్రి భువనగిరి జోన్ ఎస్ఓటీ పోలీసుల నిర్వహించిన దాడుల్లో దాదాపు ఆరు చోట్ల అక్రమాలు బయటపడ్డాయి. గతంలో అనేక సార్లు పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా కల్తీ పాలను గుట్టుచప్పుడు కాకుండా పెద్ద ఎత్తున హైదరాబాద్కు సరఫరా చేస్తున్నారు.
హైదరాబాద్కు అతి చేరువతోనే..
జిల్లాలోని భువనగిరి, బొమ్మలరామారం, బీబీనగర్, భూదాన్ పోచంపల్లి మండలాలు కల్తీ పాలకు అడ్డగా మారడానికి ప్రధానకారణం హైదరాబాద్కు అతి చేరువలో ఉండడం. రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకపోవడం, ఇకడ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతున్నది. కల్తీ పాలను హైదరాబాద్కు తరలించిన అనంతరం స్వీట్హౌజ్లు, హోటళ్లు, గృహ సముదాయలకు సైతం సరఫరా చేస్తుంటారు.
కల్తీ పాలతో నష్టాలివే..
కల్తీ పాల వల్ల చిన్నపిల్లలతో పాటు పెద్ద వారు కూడ అనారోగ్యానికి గురవుతారు. వీటిలో కలిపే యూరియా, కెమికల్స్, వంటనూనె వల్ల వాంతులు, విరేచనాలు, కడుపులో తిప్పడం, అల్సర్, గ్యాస్, జీర్ణకోశ, సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. హైడ్రోజన్ ఫెరాక్సైడ్, ఫార్మాల్డిహైడ్, సుక్రోజ్, నూనె, యూరియా, సర్ఫ్, బేకింగ్ సోడా, యూరియా, పాల పొడి లాంటి రసాయన పదార్థాలను వినియోగించి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెలుగుచూసింది. అయితే కల్తీ పాలను దీర్ఘకాలంగా తాగడం వల్ల ప్రాణాంతక క్యాన్సర్, కాలేయం, మెదడు సంబంధిత వ్యాధులతో పాటు ఇతర దుష్ప్రరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని డాక్టర్లు పేరొంటున్నారు.
కల్తీ క్షమించరాని నేరం
ఆహార పదార్థాలను కల్తీ చేయడం క్షమించరాని నేరం. కల్తీల వల్ల ప్రజలకు తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదు. అనుమానితులపై నిఘా ఏర్పాటు చేశాం. వీటితో పాటు గతంలో పాల్పడిన వారిపై ప్రత్యేక నిఘా ఉంటుంది. జిల్లాలోని అన్ని చోట్ల పోలీ సు శాఖ, ఫుడ్ కంట్రోలర్ విభాగంతోసమన్వయం చేసుకుంటూ తనిఖీలు ముమ్మరం చేస్తాం. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలి. ఇలాంటి వాటిపై సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం.
– స్వాతి,జిల్లా ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారి
ఇటీవల వెలుగు చూసిన కొన్ని ఘటనలు