భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 3 : జిల్లాలో పెండింగ్ కేసులను పరిష్కరించాలని, భువనగిరి కోర్టు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శరత్ జిల్లా ఉన్నతాధికారులకు సూచించారు. భువనగిరి జిల్లా కోర్టులో న్యాయమూర్తులు, పోలీస్, రోడ్లు, భవనాల శాఖ అధికారులు, న్యాయవాదులతో శనివారం వేర్వురుగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసుల పరిషార తీరు, పరిపాలన అంశాలపై సమీక్షించి తగు సూచనలు చేశారు. క్రిమినల్ కేసుల్లో జాప్యం లేకుండా చూడాలని డీసీపీ రాజేశ్చంద్రను ఆదేశించారు.
యాదగిరిగుట్టలో ఏర్పాటు చేయనున్న కోర్టుకు తాతాలిక భవనం, శాశ్వత నిర్మాణానికి 5 ఎకరాల స్థలం, జిల్లా కోర్టు నిర్మాణానికి చేపట్టనున్న చర్యలపై కలెక్టర్ హనుమంతు కె.జెండగే, అదనపు కలెక్టర్ ఎ.భాసర్రావు, ఆర్ అండ్ బీ ఈఈ శంకరయ్యతో సమీక్ష నిర్వహించారు. అనంతరం భువనగిరి పట్టణంలో నూతనంగా నిర్మించనున్న జిల్లా కోర్టు నిర్మాణ స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. కోర్టులో నిర్మాణాలు, సుందరీకరణ పనులు, ఇతర అంశాలపై చర్చించి భువనగిరి బార్ అసోసియేషన్ సభ్యులకు సూచనలు చేశారు.
అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిషరించారు. అంతకు ముందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు ఆయనకు జ్ఞాపికను అందజేశారు. సమావేశాల్లో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె.మారుతీదేవి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె.దశరథరామయ్య, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి డి.నాగేశ్వర్రావు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.కవిత, రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్ జూనియర్ సివిల్ జడ్జిలు ఎ.ప్రదీప్, ఎ.చందన, ఎస్.సుమలత, టి.మహతి వైష్ణవి, భువనగిరి ఏసీపీ వెంకట్రెడ్డి, భువనగిరి ఆర్డీఓ అమరేందర్, భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నాగారం అంజయ్య, కార్యదర్శి సీహెచ్ రాజశేఖర్రెడ్డి, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.