అర్వపల్లి, సెప్టెంబర్ 21 : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు డిక్లరేషన్ గ్యారెంటీ కార్డు పథకాలు బోగస్ పథకాలని, కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం అర్వపల్లి మండల కేంద్రం లో నిర్వహించిన గృహలక్ష్మి పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గడపగడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సాధ్యం కానీ హామీలు నెరవేరుస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ను గెలిపిస్తేనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని తెలిపారు. అనంతరం 249 లబ్ధిదారులకు గృహలక్ష్మి పత్రాలు పంపిణీ చేశారు. విడుతల వారీగా అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, ఆర్డీఓ వీరబ్రహ్మచారి, తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మినేని స్రవంతీసతీశ్, ఎంపీపీ మన్నె రేణుకాలక్ష్మీనర్సయ్యయాదవ్, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, గుండగాని సోమేశ్గౌడ్ పాల్గొన్నారు.