భువనగిరి కలెక్టరేట్, మే 14 : పట్టణంలోని మాసుకుం ట ఆంజనేయ సహిత రాజరాజేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం విఘ్నేశ్వర పూజతో వేడుకలకు అంకురార్పణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు జడల అమరేందర్గౌడ్ దీపారాధన చేసి పూజలు ప్రారంభించారు. ఆలయ పూజారులు కృష్ణపండ, శ్యామ్ ఆధ్వర్యంలో రుద్ర సూక్తమ, ఫల పంచామృతాలు, 14రకాల ద్రవ్యాలతో స్వామివారికి విశేష అభిషేకాలు చేశారు. అనంతరం రుద్ర హవనము, మన్యసూక్య హోమాలు చేపట్టారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి సహస్రనాగవల్లి సహిత సహస్రనామార్చన 1085 తమలపాకులతో నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, టీపీసీసీ మెంబర్ తంగళ్లపల్లి రవికుమార్, కౌన్సిలర్ శ్రీవాణి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రాచమల్ల రమేశ్, ఉద్యోగ ఐకాస జిల్లా చైర్మన్ మందడి ఉపేందర్రెడ్డి, హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ చైర్మన్ బెలిదె వెంకటేష్, ఆలయ కమిటీ సభ్యులు చింత రాజు, నీల కృష్ణ, లింగాల వెంకటేశ్, చిన్న హరి, రాచమల్ల వినోద్ పాల్గొన్నారు.
వలిగొండ : మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కొండపై హనుమాన్ జయంతి వేడుకలను వేదపండితులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయురారోగ్యాభివృద్ధి, దుష్టగ్రహ నివారణ, సకల శతృబాధ నివారణకు శ్రీ మన్యసూక్త హోమం నిర్వహించారు. మత్స్యగిరికి క్షేత్రపాలకుడైన అభయాంజనేయ స్వామికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, 108 కళశాలతో అభిషేకం నిర్వహించి అనంతరం స్వామి వారికి పల్లకి సేవను నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ మోహన్బాబు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : పట్టణంలోని శివభక్త మార్కండేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో గోశిక నర్సింహ, గోశిక భావనారుషి, బడుగు నర్సింహ, వనం హరికృష్ణ పాల్గొన్నారు.
భూదాన్ పోచంపల్లి : మండలంలోని పలు ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక భక్తాంజనేయ, మారండేశ్వర స్వామి ఆలయాల్లో ధ్వజారోహణం, విఘ్నేశ్వర స్వామి పూజ, అభిషేకం, యజ్ఞం, హనుమాన్ చాలీసా, వాహన ర్యాలీ, అన్నదానం, స్వామి వారి ఊరేగింపు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్, భక్తులు బల్ల దుర్వాసులు, సీత సత్యనారాయణ, రవ్వ లక్ష్మయ్య, నోముల అశోక్, గుర్రం కృష్ణ, లోక శ్రీరాములు, పెద్ది సత్తయ్య, సామల కైలాసం, విడం సుదర్శన్, విడం రామనాథం, దశరథ, బోగరాజు, అంబటి యాదగిరి పాల్గొన్నారు.
చౌటుప్పల్ : పట్టణ కేంద్రంలోని శ్రీ పాటిమీది భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు శివాలయంలో సైతం అభిషేకం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, స్థానిక వార్డు కౌన్సిలర్ సందగళ్ల విజయాసతీశ్గౌడ్, ఆలయ అధ్యక్షుడు సందగళ్ల నాగరాజుగౌడ్, ప్రధాన కార్యదర్శి రమేశ్గౌడ్ పాల్గొన్నారు.
రామన్నపేట : మండలవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, హనుమాన్ మూలమూర్తి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సామూహిక హోమాలు, పూర్ణహుతి నిర్వహించారు. అనంతరం వివిధ గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.