నకిరేకల్, జూన్ 5: నకిరేకల్ మండలంలోని మంగళపల్లిలో 47వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీలు గురువారం హోరాహోరీగా జరిగాయి. రెండో రోజు బాలికల, బాలుర విభాగాల్లో నుంచి చెరో 12 మ్యాచ్లు నిర్వహించినట్లు తెలంగాణ రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్కుమార్ తెలిపారు.
బాలుర విభాగం నుంచి ఖమ్మం జట్టుపై 23-19 తేడాతో వరంగల్ గెలుపొందగా.. మహబూబ్ నగర్పై 15-8 తేడాతో నల్లగొండ, రంగారెడ్డిపై 19-10 తేడాతో కరీంనగర్, అదిలాబాద్పై 20-15 తేడాతో మెదక్ గెలుపొంది సెమీఫైనల్స్కు చేరుకున్నాయి. అలాగే, బాలికల విభాగం నుంచి అదిలాబాద్పై 20-8 తేడాతో ఖమ్మం విజయం సాధించగా.. నిజామాబాద్పై 9-0 తేడాతో రంగారెడ్డి, కరీంనగర్పై 19-9 తేడాతో మహబూబ్నగర్, హైదరాబాద్పై 9-6 తేడాతో వరంగల్ గెలుపొంది సెమీఫైనల్స్కు చేరుకున్నాయని ఉమ్మడి నల్లగొండ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ ఉస్మాన్, చింతకాయల పుల్లయ్య తెలిపారు.