చిట్యాల, ఫిబ్రవరి 28 : చిట్యాల ఉన్నత పాఠశాలలో 1969-70 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన తన చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలనే ఉద్దేశంతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మంగళవారం ఉరుమడ్ల గ్రామంలోని తన స్వగృహంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. తన స్నేహితులను 53 ఏండ్ల తర్వాత కలుసుకొని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
శాసన మండలి చైర్మన్ హోదాలో నిత్యం బిజీగా ఉండే సుఖేందర్రెడ్డి తన స్నేహితులను కలిసి పేరుపేరునా ఆత్మీయతతో పలుకరిస్తూ ఆనందంగా గడిపారు. చదువు నేర్పిన గురువులను సన్మానించారు. అనంతరం చనిపోయిన తన ముగ్గురు మిత్రుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులకు ఒక్కొకరికి ర.25వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు.