నల్లగొండ, జనవరి 21 : ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు జనరల్ ఇంగ్లిష్ మీడియం గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకు పొడిగించినట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ రీజినల్ కో ఆర్డినేటర్ హెచ్.అరుణకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హులైన ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో 100 రూపాయల రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరి 2న ఎంపిక చేయబడిన ఆయా కేంద్రాల్లో ఉదయం 11నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.