నల్లగొండ : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ మండలం పాత్లవత్ తండా(టీ)లో రూ.20లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. మా గూడెంలో మా రాజ్యం మా తండాలో మా పాలన’ కావాలనే గిరిజన బిడ్డల దశాబ్దాల కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్ల కాలంలో గిరిజనుల అస్థిత్వాన్ని గుర్తించి, వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ గిరిజనులపై ప్రేమను, చిత్తశుద్ధిని దాటిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. తండాలను, ఆదివాసీ గూడాలను గ్రామపంచాయతీలుగా మార్చడంతోపాటు వాటన్నిటికీ ఒక్కొక్క జీపీ భవనాలకు 20 లక్షల చొప్పున మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలోని బంజారాల, ఆదివాసీ ఆత్మ గౌరవాన్ని సమున్నతంగా చాటిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్ గౌడ్, PACS చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పాత్లవత్ పద్మదాస్రు నాయక్, రేపని ఇద్దయ్య, జర్పుల సర్య, రాజ్ కుమార్, ఎటెలి పార్వతయ్య, బొడ్డుపల్లి కృష్ణ, పాత్లవత్ లక్ష్మణ్, కొమ్ము రామస్వామి, బాధ్య నాయక్, కొటేష్, పాండు, ఎంపీడీఓ శర్మ, APO రామచంద్రం, గణేష్ ,తదితరులు పాల్గొన్నారు.