యాదగిరిగుట్ట, జూలై 24 : నియోజవకవర్గంలో పెండింగ్తో పాటు నూతనంగా పలు అభివృద్ధి పనులకు రూ.48కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను సోమవారం కలిసి వినతిపత్రం అందించారు.
నియోజకవర్గవ్యాప్తంగా నూతనంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కుల సంఘాల భవనాలతో పాటు ఆలేరు పట్టణంలో ఇండోర్ స్టేడియంలో పెండింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో పీర్ల కొట్టాలు, అత్యవసరమైన రోడ్ల నిర్మాణాలకు కావాల్సిన నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి, త్వరలో మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన్నట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు.