మిర్యాలగూడటౌన్, డిసెంబర్25 : కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. పట్టణంలోని హౌసింగ్బోర్డ్ కాలనీలో నిర్మించనున్న సుతారి, సెంట్రింగ్, వడ్డెర కార్మికుల సంఘం భవన నిర్మాణానికి ఆదివారం మున్సిపల్ చైర్మన్ తిరునగరుభార్గవ్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బంటు రమేశ్, ఉదయ్భాస్కర్, నాయకులు పత్తిపాటి నవాబ్, మలగం రమేశ్, సాధినేని శ్రీనివాస్రావు, దుర్గారావు, అయోధ్య, మెరుగు సంజయ్, సంఘం నాయకులు వాసా హరికృష్ణ, ఖాజా హబీబ్, యాదగిరి, కోడిరెక్క మల్లయ్య, జూకంటి సీతయ్య, లక్షయ్య, దైద సైదులు, కేశవులు, సుధాకర్, రాములు, ఎల్లయ్య, వల్లాల రవి, సోనగంటి చంద్రశేఖర్, షఫీ, కోలాశ్రీను, సత్యనారాయణచారి పాల్గొన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
మిర్యాలగూడటౌన్ : యాదవ సంఘం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2023 క్యాలెండర్ను ఆదివారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ వెలిచేటి రామకృష్ణ, యాదవసంఘం డివిజన్ అధ్యక్షుడు చిమట ఎర్రయ్యయాదవ్, కార్యదర్శి చేగొండి మురలీయాదవ్, గౌరవాధ్యక్షుడు చింతలచెర్వు లింగయ్యయాదవ్, అంజి, నాగేశ్వర్రావు, జ్వాల, అచ్చయ్యయాదవ్, బోరమారయ్య, చందు, అజీమ్, శ్రీనువాస్యాదవ్ పాల్గొన్నారు.
పలువురికి ఎమ్మెల్యే పరామర్శ
వేములపల్లి : మండలంలోని రావులపెంట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు జిన్నె లింగారెడ్డి(80) ఆదివారం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు గ్రామానికి వెళ్లి లింగారెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. మండలంలోని ఆమనగల్లు మాజీ సర్పంచ్ పేరాల రామారావు ఇటీవల మృతిచెందగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మాడ్గులపల్లి మండల అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, సర్పంచ్ దొంతిరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీటీసీ నంద్యాల శ్రీరాంరెడ్డి, కందుల నాగిరెడ్డి, చందనబోయిన చంద్రయ్య, శీలం సైదులు, వంగాల సంజీవచారి ఉన్నారు.