యాదాద్రి, నవంబర్ 23 : ఆలేరు నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తావు లేదని, మరో రెండు నెలల్లో ఆ రెండు పార్టీలు ఖాళీ కావడం ఖాయమని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా 3నెలల్లో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 7వేల మంది నాయకులు టీఆర్ఎస్లో చేరారని తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణంలోని రాజాపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కోయ మల్లికార్జున్, కార్మిక సంఘం నాయకుడు ఎర్రగోకుల చంద్రయ్య, పాల సంఘం మాజీ చైర్మన్ దోమల బాలపోషయ్య, పాల సొసైటీ మాజీ డైరెక్టర్ రమేశ్, ఎమ్మార్పీఎస్ నాయకుడు పెద్దోళ్ల ప్రభాకర్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి సాయికుమార్ ఆధ్వర్యంలో 300మంది, రాజాపేట మండలం పాముకుంట గ్రామ పరిధిలోని కాశగూడెంకు చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్ ఆధ్వర్యంలో 100మంది బేగంపేటకు చెందిన మరో 50మంది నాయకులు మొత్తంగా 350మంది బుధవారం ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ ప్రజలందరికీ అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, ఎంపీపీ గోపగాని బాలమణి, జడ్పీటీసీ గోపాల్గౌడ్, టీఆర్ఎస్ రాజాపేట మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గౌటె లక్ష్మణ్, పీఏసీఎస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, వైస్ చైర్మన్ ఉపేందర్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బేడిద వీరేశం, కాశగూడెం గ్రామశాఖ అధ్యక్షుడు ఎండీ.ముగ్దుం, రాజాపేట సర్పంచ్ శ్రీశైలం, పాంకుంట సర్పంచ్ చిందం కనకయ్య, జాల సర్పంచ్ మధుసూదన్రెడ్డి, టీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు పల్లె సంతోష్గౌడ్, పార్టీ మండల సెక్రటరీ జనరల్ సందిల భాస్కర్గౌడ్, మాజీ జడ్పీటీసీ భిక్షపతిగౌడ్, టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి ప్రవీణ్, శ్రీనివాస్, జశ్వంత్, సిద్దులు, నర్సింహులు పాల్గొన్నారు.