హాలియా, జనవరి 16 : సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఈ నెల 11 నుంచి 14 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి 49వ జూనియర్ కబడ్డీ పోటీల్లో నల్లగొండ జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. బాలికల జట్టు మొదటి బహుమతి సాధించగా, బాలుర జట్టు ద్వితీయ బహుమతి గెలుచుకున్నది.
ఈ బహుమతులను కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్యాదవ్ చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించిన బాల, బాలికల జట్టు సభ్యులను కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భూలోకరావు, కర్తయ్య అభినందించారు. వారి వెంట కోచ్లు, మేనేజర్లు కృష్ణారెడ్డి, సత్యనారాయణ, అన్వర్, పరమేశ్, యడవల్లి రాంబాబు ఉన్నారు.