నల్లగొండ, ఫిబ్రవరి 12 : సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి అధికారులను బదిలీ చే స్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా పరిషత్లలో సీఈఓలు, డిప్యూ టీ సీఈఓలతో పాటు డీపీఓలను బదిలీ చేస్తూ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఆయా హోదాల్లో ఉన్న 13 పోస్టులకు స్థాన చలనం జరిగింది. సీఈఓలు, డిప్యూటీ సీఈఓల స్థ్దానం లో ఉన్న డీఆర్డీఓలు, డీపీఓలకు బదిలీ ఉత్తర్వులు అందాయి. ఆయా పోస్టుల్లో ఈ నెల 15వ తేదీ వరకు మూడేండ్ల సర్వీసు పూర్తయి నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసు కుంది. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటికే పలు ఎంపీడీఓల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే.