మిర్యాలగూడ రూరల్, జనవరి 13 : గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అధిక నిధులు కేటాయిస్తున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని చింతపల్లిలో రూ.12.60 లక్షలతో నిర్మించిన వైకుంఠధామాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న గ్రామ స్వారాజ్యం ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి వాటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. పల్లె ప్రగతి ద్వారా అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, సర్పంచ్ బాణావత్ లలితాసకృనాయక్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గడగోజు ఏడుకొండలు, ఎంపీటీసీ లక్ష్మీతులసీరాం, ఎంపీఓ వీరారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రవీందర్ నాయక్, వెంకట రాములు, నందకిశోర్, కార్యదర్శి మాధవరెడ్డి పాల్గొన్నారు.
దామరచర్ల : అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మండలంలోని గాంధీనగర్, శాంతినగర్, గణేశ్పహాడ్ గ్రామాల్లో రూ. 60 లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు, మిగిలిన 18 గ్రామ పంచాయతీల్లో రూ. 3.60 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. బండావత్ తండాలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకొని పల్లెలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలని సర్పంచులకు సూచించారు. కార్యక్రమంలో డీసీఎంస్ వైస్చైర్మన్ డి. నారాయణరెడ్డి, ఎంపీపీ ధీరావత్ నందిని, జడ్పీటీసీ ఆంగోతు లలిత, వైస్ ఎంపీపీ కటికం సైదులురెడ్డి, రైదుబంధుసమితి మండలాధ్యక్షుడు కె. వీరకోటిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కోటిరెడ్డి, ఎండీ. యూసుఫ్, కోఆప్షన్ సభ్యుడు నాగుల్మీరా, లావూరి మేగ్యానాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.