యాదగిరిగుట్ట, అక్టోబర్ 10 : ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందరెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఎస్యూఐ మాజీ జిల్లా అధ్యక్షుడు చామల ఉదయ్చందర్రెడ్డి ప్రగతి భవన్లో మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధర్రావు సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఆలేరులో గులాబీ జెండా ఎగురబోతుందన్నారు.
బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించి కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో యాదగిరిగుట్ట మండలంలోని దాతారుపల్లికి చెందిన తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు డాక్టర్ అన్వేశ్, ఐఎంఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ భానుచందర్, గౌరాయిపల్లికి చెందిన వడ్లకొండ శ్రీకాంత్, మోటకొండూర్కు చెందిన భాను చందర్రెడ్డి, చాడ గ్రామానికి చెందిన మోకు దెబ్బ రాష్ట్ర నాయకుడు కూరెళ్ల నరేశ్గౌడ్, నాంచారిపేటకు చెందిన గంధమల్ల కరుణాకర్, ఆత్మకూరు(ఎం)కు చెందిన తిరునగరి ఫణిందర్, కొండాపూర్కు చెందిన కొప్పుల నర్సిరెడ్డి, రుస్తాపూర్కు చెందిన కొండపురం శ్రీహరి, శ్రీకాంత్, తేర్యాలకు చెందిన చామల మేఘారెడ్డి, రాఘవపురానికి చెందిన భగవంత్రెడ్డి ఉన్నారు.
మేళ్లచెర్వు/ హుజూర్నగర్ : మండల కేంద్రానికి చెందిన వైఎస్ఆర్టీపీ నియోజకవర్గ ఇన్చార్జి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ జిల్లేపల్లి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, హుజూర్నగర్, నల్లగొండ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, కంచర్ల భూపాల్రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా హుజూర్నగర్లో హేమ్లాతండా, జగ్గు తండాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీకి చెందిన 100కుటుంబాల వారు బీఆర్ఎస్లో చేరారు.